ఆచార్య బాలకృష్ణ
భారతీయ వ్యాపారవేత్త, ఆయుర్వేద పండితుడు
ఆచార్య బాలకృష్ణ (జన్మనామం: నారాయణ్ ప్రసాద్ సుబేది[2]) భారత దేశానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థల కార్యనిర్వాహణాధికారి.[3] యోగ్ సందేశ్ అనే పత్రికకు ముఖ్య సంపాదకుడిగానూ, పతంజలి విద్యాపీఠానికి అధినేతగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
వ్యక్తిగతం
బాలకృష్ణ అసలు పేరు నారాయణ్ ప్రసాద్ సుబేది. ఆయన నేపాల్ లో పుట్టాడు. భారత్ లో పెరిగాడు. హర్యానా లో ఓ గురుకులం లో చదువుకునేటపుడు బాబా రాందేవ్ తో పరిచయం ఏర్పడింది.