ధీరుభాయ్ అంబానీ గా పేరుపొందిన ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ (1932 డిసెంబరు 28 – 2002 జులై 6) భారతదేశ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు. 1977లో ఈ సంస్థ పబ్లిక్ కి వెళ్ళింది. 2016లో భారత ప్రభుత్వం ఆయన వ్యాపార, వాణిజ్యాల్లో ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన మరణం తర్వాత కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు.
ధీరుభాయ్ అంబానీ
2002 లో అంబానీ పేరు మీద భారత తపాలా సంస్థ విడుదల చేసిన తపాలా బిళ్ళ
జననం
ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ
1932 డిసెంబరు 28
చోర్వాడ్, జునాగఢ్ రాష్ట్తం, కథియావార్ ఏజెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్)