మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( వినండి (help·info)) (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.
బ్రిటీష్ రాజ్యం (1869–1947) డొమినియన్ ఆఫ్ ఇండియా (1947–1948)
విద్యాసంస్థ
ఆల్ఫ్రెడ్ హైస్కూల్, రాజ్కోట్ (1880 – నవంబర్1887) సామల్దాస్ ఆర్ట్స్ కాలేజ్, భావ్ నగర్ (1880 జనవరి – 1888 జులై ) ఇన్నర్ టెంపుల్, లండన్ (1888 సెప్టెంబరు –1891)
వృత్తి
న్యాయవాది
వలసవాద వ్యతిరేకి
రాజనీతిజ్ఞుడు
క్రియాశీల సంవత్సరాలు
1893–1948
శకం
బ్రిటీష్ రాజ్యం
సుపరిచితుడు
ఆంగ్లేయుల నుంచి భారత స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం, అహింసా పోరాటం
20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.