Milkha Singh

 



మిల్ఖా సింగ్


మిల్ఖా సింగ్ (1935 నవంబరు 20 - 2021 జూన్ 18) భారత్ కు చెందిన సిక్కు అథ్లెట్. ఇతన్ని ఫ్లయింగ్ సిఖ్ అని పిలుస్తారు. అరుదైన, ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. 2013 నాటికి, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా (అథ్లెట్) గుర్తింపు పొందాడు. భారత్ తరపున 1956 లో మెల్బోర్న్ నగరంలో జరిగిన వేసవి ఒలంపిక్స్ లోను, 1960 లో రోమ్ లో జరిగిన ఒలంపిక్స్ లోను, 1964 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ పోటీల్లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఇతన్ని "పద్మశ్రీ" పురస్కారంతో సత్కరించింది.

మిల్ఖా సింగ్
Milkha Singh.jpg
2012లో, చండీగఢ్ గోల్ఫ్ క్లబ్ వద్ద మిల్ఖా సింగ్
జననం1935 నవంబరు 20
గోవింద్ పుర, పంజాబ్ (ప్రస్తుత పాకిస్తాన్)
మరణం2021 జూన్ 18 (వయస్సు 91)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుThe Flying Sikh (ఎగిరే సిఖ్)
వృత్తిట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడు
ఉద్యోగంభారత సైన్యం నుండి, పుంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి పదవీ విరమణ చెశారు.
జీవిత భాగస్వామినిర్మల్ కౌర్
పిల్లలు3 కుమార్తెలు; 1 పుత్రుడు; 1 దత్తపుత్రుడు
Olympic medal record
Men's Athletics
ప్రాతినిధ్యం వహించిన దేశము  IND
British Empire and Commonwealth Games
స్వర్ణము1958 Cardiff440 yards
Asian Games
స్వర్ణము1958 Tokyo200 m
స్వర్ణము1958 Tokyo400 m
స్వర్ణము1962 Jakarta400 m
స్వర్ణము1962 Jakarta4 x 400 m relay

1960 ఒలింపిక్ పోటీల్లో అతడు పాల్గొన్న 400 మీటర్ల పరుగు పందెం అతడి కెరీర్లో చిరస్మరణీయమైనది. అందులో అతడు 4 వ స్థానంలో నిలిచాడు. ఆపోటీలో అతడు చేసిన 45.73 సెకండ్ల పరుగు, భారతదేశ రికార్డుగా 40 ఏళ్ళ పాటు నిలిచింది.

దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్ఖా సింగ్, తరువాత కాలంలో భారతదేశపు ప్రసిద్ధ క్రీడా చిహ్నంగా అవతరించాడు. 2008లో రోహిత్ బ్రిజ్నాథ్ అనే ఒక పాత్రికేయుడు, మిల్ఖా సింగ్ ను "భారతదేశపు అత్యుత్తమ క్రీడాకారుడి"గా అభివర్ణించారు. జులై, 2012లో "ద ఇండిపెండంట్" అనే ఓ బ్రిటిష్ వార్తాపత్రిక,"మిల్ఖా సింగ్, భారత దేశపు అత్యుత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు, ఒక ఘనమైన పరాజితుడు కూడా" అని పేర్కొంటూ, అతడు సాధించిన విజయాలు అతి తక్కువని, వందకోట్లమందికి పైగా జనాభా ఉన్నప్పటికీ, భారతదేశం అతడి (మిల్ఖా సింగ్) ద్వారా 20 పతకాలు మాత్రమే సాధించగలిగిందని తమ పత్రికలో వ్యంగ్యంగా ప్రచురించింది.

Previous Post Next Post